Bronze health Benefits

భావ ప్రకాశ నిఘంటువు అనే గ్రంధంలో  ఈ శ్లోకం చెప్పబడి ఉంది 
 "కాంస్య పాత్ర శాఖాన్న భోజేనేష, దీపనం మతమ్  బల్యం నేత్య్ర వృష్యం, పాచనంచ త్రిదోష శమనం మతమ్, క్షయరోగ విషం చైవ నాశమే మునిభిహి పరికీర్తితమ్ "

ఇప్పుడు శ్లోకం యొక్క వివరణ ఏంటో స్పష్టంగా చూద్దాం :
ఈ శ్లోకం కంచు  పాత్రలలో ఆహారం తీసుకోవడం వల్ల కలిగే ఐదు ముఖ్య ప్రయోజనాలను స్పష్టంగా తెలియజేస్తుంది:
కాంస్య పాత్ర శాఖాన్న భోజేనేష : కంచు పాత్రలలో వండిన శాఖాహార భోజనం తింటే కలిగే ప్రయోజనాలు గురించి ఈ శ్లోకం చెబుతుంది మొదటిది 

 దీపనం అంటే  (జీర్ణశక్తిని పెంచుతుంది): కంచు  పాత్రలలో ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది ఆకలిని పెంచి, మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.
 బల్యం (బలాన్ని ఇస్తుంది): కంచు  పాత్రలలో ఆహారం తీసుకోవడం శరీరానికి బలాన్ని చేకూరుస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని దృఢంగా ఉంచడంలో తోడ్పడుతుంది.

 నేత్ర వృష్యం (కళ్ళకు మంచిది): ఈ పాత్రలు కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నేత్ర దృష్టిని మెరుగుపరచడంలో, కంటి సంబంధిత సమస్యలను తగ్గించడంలో ఇవి సహాయపడతాయని ఆయుర్వేదం చెబుతోంది.

 పాచనంచ త్రిదోష శమనం మతం (త్రిదోషాలను సమతుల్యం చేస్తుంది): ఆయుర్వేదం ప్రకారం, మన శరీరంలో వాత, పిత్త, కఫ అనే మూడు దోషాలు ఉంటాయి. ఈ మూడు దోషాలు సమతుల్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. కాంస్య పాత్రలు ఈ త్రిదోషాలను సమతుల్యం చేసి, శరీరంలో సమగ్ర ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.

 క్షయరోగ విషం చైవ నాశమే మునిభిహి పరికీర్తితం (క్షయ మరియు విష ప్రభావాలను నాశనం చేస్తుంది): ఇది అత్యంత ముఖ్యమైన ప్రయోజనాలలో ఒకటి. కాంస్య పాత్రలలో ఆహారం తీసుకోవడం వల్ల క్షయ (టి.బి.) వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని, అలాగే శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను (toxins) తొలగించడంలో సహాయపడుతుందని  మునులు పలు ఆయుర్వేద గ్రంధాలలో చెప్పడం జరిగింది 

Comments

Popular posts from this blog